అవిశ్వాసానికి మిత్రపక్షాల మద్దతు హర్షణీయం

ఒంగోలు :

యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం శుభపరిణామం అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయానికి మిత్రపక్షాల మద్దతు పలకటం సంతోషకర‌ం అన్నారు.

అవిశ్వాస తీర్మానం నోటీసులకు మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు, వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌కి చెందిన ముగ్గురు, టీడీపీ సీమాంధ్ర ఎంపీలు నలుగురు మొత్తం 13 మంది సోమవారం లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.‌ అవిశ్వాసానికి బీజేడీ మద్దతు తెలుపుతామని ప్రకటించింది.

Back to Top