ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేస్తున్న సర్కార్

ప్రకాశం: మహోన్నత లక్ష్యం, మానవత దృక్పథంతో మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ప్రకాశం జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1300 కోట్లు అవసరమైతే.. ప్రభుత్వం కేవలం రూ. 200 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంటోందని ఆయన విమర్శించారు.

ఆరోగ్యశ్రీ పథకంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 9న వైయస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద చేపడుతున్న భారీ ధర్నాకు అభిమానులు, కార్యకర్తలతో పాటు ఆరోగ్యశ్రీ పథకం అందని బాధితులు హాజరుకావాలని బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి పిలుపునిచ్చారు. 

తాజా వీడియోలు

Back to Top