బాధిత రైతులతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు..!

కర్నూలుః హంద్రీనీవా ప్రాజెక్ట్ కాలువ తూముకు షటర్ వేయకపోవడంతో వరదనీరు పంటపొలాల్లోకి పోటెత్తింది. దీంతో వందలెకరాల్లో భారీ నష్టం సంభవించింది. మొక్కజొన్న, పొగాకు పంటలు నీటిపాలయ్యాయి. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు వద్ద దెబ్బతిన్న పంటపొలాలను, ప్రాజెక్ట్ ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. నీటి ఉధృతికి దెబ్బతిన్న ప్రాంతంలో వెంటనే మరమ్మతులు పూర్తిచేయాలని  అధికారులను కోరారు. నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యేలు ఐజయ్య, చరితారెడ్డితో పాటు వైఎస్సార్సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి , ఎంపీపీ ప్రసాద్ రెడ్డి పంటలు దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు.

Back to Top