రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
మహానాడు వేదికగా బాబు పచ్చి అబద్ధాలు
27 May 2016 4:49 PM
హైదరాబాద్ః అవకాశాన్ని సంక్షోభంగా మార్చగల ఘనడు చంద్రబాబు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను అవినీతి ప్రదేశ్ గా మార్చేందుకు మహానాడును వేదికగా చేసుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మహానాడులో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలపై చర్చించడం మానేసి...ప్రతిపక్ష నాయకుడిని తిట్టడమే పనిగా పెట్టుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజలు ఏం చెప్పినా వింటారన్న భ్రమలో బాబు మహానాడులో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కరుణాకర్ రెడ్డి ఫైరయ్యారు. చంద్రబాబు పనిగట్టుకొని వైయస్ జగన్ పై అబాంఢాలు వేస్తున్నారని కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే పట్టిసీమ, అమరావతి భూదందా విషయంలో సీబీఐతోగానీ, సిట్టింగ్ జడ్జితోగానీ విచారణ చేయించాలని సవాల్ చేశారు.