పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
తిరుమల పవిత్రతను మంట గలుపుతున్నారు- కారుమూరు నాగేశ్వరరావు
17 May 2018 5:01 PM
సంప్రదాయాలను తుంగలో తొక్కే
విధంగా వ్యవహరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తిరుపతి పవిత్రతను మంటగలుపుతోందని మాజీ
ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు విమర్శించారు. సన్నిధి గొల్లలు తొలిగా తలుపులు
తీసే కార్యక్రమం అనాదిగా వస్తోంది దానిని తొలగించారనీ, ఇప్పుడు ప్రధాన అర్చకుల
విషయంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చేయడం బాధ కలిగిస్తోందన్నారు. చంద్రబాబు తన
పాలనలో అన్ని వ్యవస్థలను పాడు చేశారు, అదే తరహాలో తిరుపతిలోనూ వ్యవహరించడం
ఎంతమాత్రం భావ్యం కాదు. గుడి పవిత్రతను యాదవులందరూ ఆందోళనలు చేస్తే, యాదవ ప్రజలను
మిమ్మల్ని క్షమించరన్నారు. యాదవలుందరూ సన్నిధి గొల్లలను కొనాగించాలని ఆందోళన
చేస్తున్నారు. టిటిడి ఛైర్మన్ సుధాకర్ యాదవ్ తనకు పదవి ముఖ్యమో, యాదవులకు,
అర్చకులకు అన్యాయం చేయడమే లక్ష్యమా తేల్చుకోవాలన్నారు. ఇకనైనా తమధోరణిని
మార్చుకోకుంటే ప్రజా ఉద్యమంతో ఆగ్రహానికి
గురికాక తప్పదని హెచ్చరించారు.