సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతరఅట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..!
ధర్మయుద్ధం అనడం హాస్యాస్పదం
03 Apr 2018 12:20 PM
ఢిల్లీ: చంద్రబాబు ధర్మయుద్ధం చేస్తాననడం హాస్యాస్పదమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. 29సార్లు ఢిల్లీకి వచ్చి ఏం సాధించారని చంద్రబాబు మళ్లీ వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీకి వచ్చారన్నారు. పూర్తిగా అవినీతితో కూరుకుపోయిన చంద్రబాబు.. నాలుగేళ్లు ప్రత్యేక హోదాను పక్కనబెట్టి ఇప్పుడు కేంద్రంపై ధర్మయుద్ధం చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేసుల మాఫీ కోసం.. ఓట్ల కోసం వచ్చి ప్రత్యేక హోదాకు మద్దతు కూడగట్టడానికి వచ్చానని చెప్పడం హేయనీయమన్నారు. మీడియా వారి చేతిలో ఉందని డబ్బాలు కొట్టుకుంటున్నారని విమర్శించారు. పూర్తిగా అవినీతితో కూరుకుపోయిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు.