జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
బాబు మాట నిలబెట్టుకో-చాంద్ బాషా
29 Mar 2016 12:33 PM
హైదరాబాద్ః ముఖ్యమంత్రి చంద్రబాబు గత జూన్ 14న కదిరికి వచ్చినప్పుడు రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, సంవత్సరం అవుతున్నా ఇంతవరకు ఆ ఊసేలేకపోవడం బాధాకరమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా సభలో ప్రస్తావించారు. ఇంతవరకు ఎక్కడా ఆ దిశగా పనులు ప్రారంభం కాలేదు. ఎలాంటి సర్వేలు జరగలేదన్నారు.
19-3-2015న తాను ప్రశ్నిస్తే 135 కోట్లతో బైపాస్ ప్రతిపాదన చేసినట్లు సభలో చెప్పారని గుర్తు చేశారు. ఏడాది గడిచినా ఇంతవరకు ఎలాంటి కేటాయింపులు గానీ, బైపాస్ ప్రస్తావన గానీ జరగలేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటీవల కదిరి నుంచి బెంగళూరు వెళ్తున్న సిమెంట్ లారీ ప్రమాదానికి గురై 25 మంది చనిపోయారని..దాన్ని దృష్టిలో ఉంచుకొని బైపాస్ రోడ్డు వేయాలన్నారు.