22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
బాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు
16 Jun 2016 11:59 AM
ప్రజాసమస్యలు గాలికొదిలిన టీడీపీ
అక్రమ సంపాదనే ధ్యేయంగా అవినీతి పాలన
ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైయస్సార్సీపీ గెలుపు తథ్యం
నెల్లూరుః అభివృద్ధి ముసుగులో ప్రభుత్వం సాగిస్తున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని, రాష్ట్రాభివృద్ధికి కాదని వైయస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. వరిగొండ పంచాయతీలో ఎన్డీఆర్ అధినేతలు నిర్మించిన రెండు ఆర్వోప్లాంట్లను, ఎంపీ నిధులతో నిర్మించిన ఓ సీసీ రోడ్డు ను ఎమ్మెల్యే కాకాణి ప్రారంభించారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాయంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్ష పార్టీ నాయకులు అడ్డుకొంటున్నారనీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటీ నెరవేర్చలేక ప్రజలకు ఏం సమాధానం చెప్పలేక సీఎం, ఆ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. రూ.లక్ష కోట్లు అయినా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రైతులు తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీలను కూడా పూర్తిస్థాయిలో మాఫీ చేయలేకపోయారన్నా రు.
ఇంటింటికో ఉద్యోగం, రూ.2వేల నిరుద్యోగ భృతి ఏమయ్యాయో చెప్పాలన్నారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పింఛన్లను, ఇళ్లను, ఇతర పథకాలను సొంత పార్టీ కార్యకర్తలకే దోచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గచర్యగా అభివర్ణించారు. గతంలో ఎమ్మెల్యేలకు ఏడాదికి రూ.కోటి నిధులు మంజూరు అయ్యేవన్నారు. కాని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఆ నిధులను సైతం చంద్రబాబు నిలిపేశారన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
ప్రజా సమస్యలను గాలికొదిలి అక్రమ సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హ త ఇక ఎంత మాత్రం లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైయస్సార్సీపీ అఖండ మెజార్టీతో అధికారాన్ని సాధించడం ఖాయమని కాకాణి స్పష్టం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం చిరంజీవులగౌడ్, ఎంపీడీఓ సావిత్రమ్మ, ఎంపీటీసీ సభ్యులు కమతం సునీత, వైయస్సార్సీపీ జిల్లా కార్యదర్శి సుధీర్రెడ్డి, సంయుక్త కార్యదర్శి దిలీప్రెడ్డి, మండల కన్వీనర్ పద్మనాభరెడ్డి,ఎన్డీఆర్ అధినేతలు ఆదికేశువులరెడ్డి, అమృతేష్రెడ్డి, పార్టీ నాయకులు చంద్రశేఖర్రెడ్డి, శ్యామలమ్మ, సురేష్రెడ్డి, రామ్మూర్తి, సుబ్బారావు, శంకరయ్యగౌడ్, జితేంద్రరెడ్డి, శేషమ్మ ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.