కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
బందర్ పోర్టులో బాబుకు వాటాలు
09 Jul 2016 3:04 PM
విజయవాడ: బందరు పోర్టులో చంద్రబాబు నాయుడుకు పరోక్ష వాటాలున్నాయని వైయస్సార్సీపీ నేత గౌతంరెడ్డి బయటపెట్టారు. పోర్టు భూముల అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. వాటాలున్నందుకే లక్షా ఐదువేల ఎకరాలను భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సేకరించాలని బాబు సిద్ధమవుతున్నారని విమర్శించారు. రాజధాని పేరుతో సింగపూర్ కంపెనీలకు వేలాది ఎకరాలను దోచిపెట్టిన చంద్రబాబు... బందరు పోర్టు పేరుతో ఇప్పుడు చైనా కంపెనీలకు భూములు కట్టబెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. భూములను బలవంతంగా లాక్కుంటే ప్రతిపక్ష వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రైతులకు అండగా వైయస్సార్సీపీ పోరాడుతుందని గౌతంరెడ్డి తెలిపారు.