వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
చంద్రబాబు సిఎంగా ఉండటం మన కర్మ - ఎంపి మేకపాటి ధ్వజం
02 Jun 2018 3:25 PM
రాష్ట్రానికి
చంద్రబాబు నాయుడి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల కర్మ అని ఎంపి మేకపాటి
రాజమోహన్ రెడ్డి అన్నారు. తెలుగుజాతికి చంద్రబాబు చేసిన ద్రోహం ఎప్పటికీ
మరచిపోలేనిదని ఆయన అన్నారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వంచన
పై గర్జన సభలో ఆయన మాట్లాడారు. సొంతమామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఎన్నికల
సందర్బంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు.
చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వెళ్లానంటూ చెప్పుకుంటున్నారనీ, వాస్తవంలో ఆయన
వెళ్లింది హోదా కోసం కాదని వైయస్ జగన్ పై అక్రమ కేసుల బనాయించడానికి, అసెంబ్లీ
సీట్ల పెంపు కోసమే అని మండిపడ్డారు.