కరువుకు కేరాఫ్ చంద్రబాబు

శ్రీకాళహస్తి:

వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా బాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాబు సొంత జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలను మూయించేసాడని మండిపడ్డారు. ఇప్పుడు మన్నవరం ప్రాజెక్ట్ను ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారని ధ్వజమెత్తారు. కరువుకు పాస్వర్డ్, అనావృష్టికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు' అని రోజా విమర్శించారు. బుధవారం ఆమె శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకూ కేంద్రానికి కరువు నివేదిక ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. దీనిబట్టే  చంద్రబాబుకు రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతోందని రోజా చురక అంటించారు.

Back to Top