బాబుబలి‍‍‍-2 బయటకొస్తే చంద్రబాబు జైలుకే

  • చంద్రబాబు బాబు కూడా పార్టీని ఖాళీ చేయించలేరు
  • రాయలసీమపై ఎందుకంత కక్ష బాబు మీకు
  • కరువుకు షర్ట్, ప్యాంట్ వేస్తే అదే చంద్రబాబు
  • కేసీఆర్ బాబుకు బాబు బలి పార్ట్ -1 చూపించారు
  • ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించే దమ్ముందా 
  • చంద్రబాబుపై ధ్వజమెత్తిన రోజా

  • కర్నూలుః వైయస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరువుకు షర్టు, ప్యాంటు వేస్తే అదే చంద్రబాబు అని  రోజా ఎద్దేవా చేశారు.  కర్నూలులో  'జలదీక్ష' రెండోరోజున రోజా వైయస్ జగన్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబుతో పాటే రాష్ట్రంలో మళ్లీ కరువు వచ్చిందని, గతంలో తొమ్మిదేళ్లు.. ఇప్పుడు రెండేళ్లుగా కరువుతో అల్లాడుతున్నామని అన్నారు. ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యారో ఆ రోజు నుంచి కరువుతో బాధపడుతున్నామని చెప్పారు. ఆయన కృష్ణా జిల్లాకు వెళ్లారు, డెల్టా మొత్తం ఎడారిలా మారిపోయిందని, లింగమనేని గెస్ట్‌హౌస్‌లో ఉంటే ప్రకాశం బ్యారేజి ఎండిపోయిందని, కర్నూలు వస్తే శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు అడుగంటిపోయాయని ఎద్దేవా చేశారు. ఇంతటి తీవ్రమైన కరువును పట్టించుకోకుండా  బాబు కుటుంబ సభ్యులతో విహార యాత్రలు చేస్తున్నాడని మండిపడ్డారు.

    కరువు నిధులను కూడా వదలకుండా దోచేసుకుంటున్నారని, మజ్జిగ పేరుతో 39 కోట్లు విడుదల చేసి, హెరిటేజ్ మజ్జిగను అమ్ముకుంటున్నారని విమర్శించారు. కరువు రాష్ట్రాల సీఎంలు అంతా మోదీని కలిసి నిధుల కోసం మాట్లాడుతుంటే బాబు మాత్రం దోచుకున్న డబ్బులు స్విట్జర్లాండ్‌లో తన బినామీల పేరిట దాచుకోడానికి వెళ్లారని ఆరోపించారు. రాష్ట్రానికి రూ. 4 వేల కోట్ల నష్టం వస్తే కనీసం 400 కోట్లు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. పశువులకు కూడా నీళ్లు లేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని, ఇలాంటి పరిస్థితిలో కూడా ఎగువన అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని ఆమె ఫైరయ్యారు. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని తెలిసి కూడా చంద్రబాబు మాట్లాడటం లేదని మండిపడ్డారు. పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో రాయలసీమకు చుక్క నీరు కూడా రాదన్నారు. సీమ ప్రాజెక్టులన్నీ ఉత్సవ విగ్రహాలుగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు.  ఏడాదిగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు జరుగుతుంటే చంద్రబాబు సైలెంట్‌గా గమనిస్తున్నారే తప్ప నోరు విప్పి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

    రాజమౌళి మనకు బాహుబలి సినిమా చూపిస్తే, కేసీఆర్ మాత్రం చంద్రబాబుకు బాబు బలి పార్ట్ 1 చూపించారని, అందుకే ఆయన హైదరాబాద్‌ నుంచి మూటాముల్లె సర్దుకుని విజయవాడ పారిపోయారని ఎద్దేవా చేశారు. బాబు బలి పార్ట్ 2 బయటకు వస్తే చంద్రబాబు జైల్లో ఉండక తప్పదని స్పష్టం చేశారు. ఓటుకు కోట్లు కేసు కోసం కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని, కేసీఆర్ దగ్గర రాయలసీమ ప్రాజెక్టులను తాకట్టు పెట్టారని ఫైరయ్యారు. సీమ అంటేనే చంద్రబాబుకు కక్షని, తనకు ఓట్లేయలేదన్న కసితో సీమ మీద పగ తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. కమీషన్ల కోసం పట్టిసీమ పేరుతోరూ. 1500 కోట్లను నీళ్లపాలు చేశారని, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను గాలికి వదిలేశారని అన్నారు. తాము సమస్యలపై నిలదీస్తుంటే ఎస్సీ ,ఎస్టీ కేసులు పెడుతున్నారు.  అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 

    చంద్రబాబు కాదు కదా.. ఆయనను పుట్టించిన ఖర్జూరనాయుడుకు కూడా వైయస్సార్సీపీని ఖాళీ చేయించే దమ్ము లేదని ఆమె స్పష్టం చేశారు.
    మోదీ, పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకుని బాబు కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారని అన్నారు. అదే వైయస్ జగన్ పార్టీ పెట్టిన కొత్తలో ఎంపీగా పోటీ చేస్తేనే 5.5 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చిందని గుర్తుచేశారు. చంద్రబాబులో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. వైయస్ జగన్ తరఫున ఒక మహిళా ఎమ్మెల్యేగా వార్ డిక్లేర్ చేస్తున్నానని, ఉప ఎన్నికలకు వెళ్తే నీ అభివృద్ధి ఏంటో, వైయస్ జగన్ పట్ల జనానికి ఉన్న అభిమానం ఏంటో తెలుస్తుందని ఆమె అన్నారు.

తాజా వీడియోలు

Back to Top