ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు: శ్రీకాంత్ రెడ్డి

కడప 02 ఆగస్టు 2013:

మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీలు  కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించి ఆ నిందను తమ పార్టీపై రుద్దటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  ఆయన శుక్రవారం కడపలో మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ సమైక్యవాదో...కాదో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులు తిరగేస్తే తెలుస్తుందన్నారు. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి....సోనియాగాంధీ కాళ్లు మొక్కి తిరిగి వచ్చారని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఎద్దేవా చేశారు.

Back to Top