మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
పెచ్చుమీరుతున్న పచ్చనేతల అరాచకాలు
05 Jul 2016 11:28 AM
కర్నూలుః అధికార పార్టీ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తమకు అడ్డొస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదనే సంకేతాలిస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు లోను చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మధు అనుచరులు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. కారుకు అడ్డొచ్చారనే చిన్న కారణంతో తండ్రీ కుమారుడిని బెల్టుతో చితకబాదడం.. కుమారుడిని వదిలిపెట్టండని తండ్రి కాళ్లావేళ్లా పడినా కనికరించకపోవడం చూస్తే.. ఆ పార్టీ ప్రజల్లోకి ఎలాంటి సందేశం పంపుతుందో అర్థమవుతోంది. టీడీపీ నేతల దాదాగిరిపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అధికారగర్వంతో వ్యవహరిస్తున్న టీడీపీకి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.