మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఆర్యవైశ్యుల రుణం తీర్చుకుంటా : శిల్పా మోహన్ రెడ్డి
19 Aug 2017 12:25 PM
నంద్యాల: తనకు అండగా ఉన్న ఆర్యవైశ్యుల రుణం తీర్చుకుంటానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డి అన్నారు. ఆర్యవైశ్యులతో 35 ఏళ్లుగా తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారికి చివరి వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నంద్యాల పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో శిల్పా మాట్లాడారు. తనకు ఆర్యవైశ్యులు 2004, 2009, 2014 ఎన్నికల్లో అండగా నిలిచిన ఆర్యవైశ్యులకు రుణపడి ఉంటానని, ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలో కూడా ఎప్పటిలాగే తమ సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్యులలో చాలా మంది పేద వాళ్లు ఉన్నారని, అలాంటి వారికి రైతు నగర్ వద్ద స్థలాలు కూడా కేటాయించామన్నారు. వంద కోట్ల ఆస్తిని ఎవరు లాక్కున్నారో ఆర్యవైశ్యులు ఆలోచించాలన్నారు. శిల్పామోహన్రెడ్డి ఎవరినైనా బెదిరించారా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైయస్ఆర్సీపీని గెలిపించాలని అభ్యర్థించారు.