రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఫిర్యాదులకు సన్నాహాలు
07 Jun 2016 8:27 AM
కర్నూలు): వైయస్సార్సీపీ పార్టీ నిర్ణయం ప్రకారం రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాచరణ కు సన్నాహాలు జరుగుతున్నాయి. రెండేళ్లయినా ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వంపై జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విడుదల చేసిన ప్రకటనలో ప్రజలను కోరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలపై కర్నూలులో మూడవ పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందన్నారు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి తదితర ఎన్నో హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఫిర్యాదుల కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.