వర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
సింగపూర్ లో అధికారులకు శిక్షణ
08 Sep 2015 7:08 PM
ప్రభుత్వ అధికారులకు సింగపూర్ కంపెనీల కోచింగ్
ప్రైవేటు శిక్షణ కోసం సర్కారీ ఉద్యోగులు
ఖర్చంతా ప్రభుత్వానిదే..!
హైదరాబాద్: రాజధాని ని పూర్తిగా సింగపూర్ గుప్పెట్లో పెట్టేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకొన్నారు. ఇందుకు తగినట్లుగా ప్రతీ అంశంలోనూ సింగపూర్ నామస్మరణ చేస్తున్నారు.
రాజధాని అధికారులకు పాఠాలు
రాజధాని ప్రాంతంలో వ్యవహారాల్ని పర్యవేక్షించే సాధికార విభాగం- క్రీడా కు చెందిన 25 మంది అధికారుల్ని సింగపూర్ కు పంపిస్తున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి కోచింగ్ ఇప్పిస్తున్నారు. కొత్త రాజధానిలో భూ వినియోగం, రవాణా వ్యవస్థ, మౌళిక వసతుల అబివృద్ది, ప్రైవేటు, పబ్లిక్ సామాజిక రంగాల నిర్మాణం, గ్రీనరీ, పారిశ్రామిక, ఆర్థిక పురోగతి వంటి అంశాల మీద శిక్ష ణ ఇవ్వనున్నారు. ఆంధ్ర్రప్రదేశ్ లీడర్స్ ఇన్ అర్బన్ గవర్నెన్స్ ప్రోగ్రామ్ పేరుతో ఈ శిక్షణ ఉండబోతోంది.
సింగపూర్ లో ప్రైవేటు కోచింగ్
ఇప్పటికే సర్వం సింగపూర్ కు అప్పగించటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో ఈ కోచింగ్ మీద కూడా అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తం వ్యవహారాలన్నీ సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా మార్చేందు కోసమే ఈ శిక్షణ ఏర్పాటు చేశారన్న మాట వినిపిస్తోంది. అందుకోసమే సింగపూర్ కంపెనీల తో కోచింగ్ ఏర్పాటు చేశారని చెబుతున్నారు. దీనికి అయ్యే మొత్తం ఖర్చు రూ. 4 లక్షలు కూడా ప్రభుత్వమే భరించ నుంది.