వైయస్ జగన్ ను కలిసిన రజక సంఘం అధ్యక్షుడు

గుంటూరు : వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ను ఏపీ రజక సంఘం అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు గుంటూరులో కలుసుకున్నారు. తమ సామాజిక వర్గాన్ని ఎస్సీల్లో చేర్చే డిమాండ్కు మద్దతు ఇవ్వాలని వైయస్ జగన్ను కోరారు. రజకులను ఎస్సీల జాబితాలో చేర్చే అంశాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని  వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాన్ని  చంద్రబాబు ఇప్పటి వరకు అమలు చేయలేదని  అంజిబాబు వైయస్ జగన్కు చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయనకు అంజిబాబు విజ్ఞప్తి చేశారు.

Back to Top