తెల్ల‌వారుజాము నుంచే ఏపీ బంద్‌





 - హోదా కోసం నిన‌దిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు
- రోడ్డెక్క‌ని వాహ‌నాలు
- పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని బంద్‌ను విఫ‌లం చేసేందుకు ప్ర‌భుత్వం కుట్ర‌
- వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల అరెస్టు, గృహ నిర్బంధం

 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్‌ను పాటించాల్సిందిగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ ఇచ్చిన పిలుపునకు స్పందించిన పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే బంద్‌లో పాల్గొన్నాయి. వాహనాలు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్‌ చేయిస్తోంది. పలువురు నాయకులను గృహనిర్బంధంలో ఉంచింది.

 అంబటిపై అమానుషం
బంద్‌లో పాల్గొన్నవైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను స్టేషన్లు మారుస్తా తిప్పుతున్నారు. మొదట సత్తెనపల్లి నుంచి ముప్పాళ్ల తీసుకెళ్లారు. తర్వాత రాజుపాలెం పీఎస్‌కు తరలించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని నరసరావు పేట నుంచి నాదెండ్ల పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

గుంటూరు : 
జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో నాలుగు గంటల నుంచే  బస్టాండు ఎదుట కార్యకర్తలు ధర్నాకు దిగారు. వినుకొండ సమన్వయకర్త బొల్లాబ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. తెనాలిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అన్నాబత్తుని శివకుమార్, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సత్తెనపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబటి రాంబాబు ఆధ్వర్యంలోవైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. గుంటూరులో బస్సులను అడ్డుకున్న ఎమ్మెల్యే ముస్తఫా, మేరుగ నాగార్జున, ఎల్.అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, శ్రీకృష్ణదేవరాయలు, కిలారు రోశయ్యల, రేపల్లెలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేటలో బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

ప్రకాశం జిల్లా :
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ చీమకుర్తిలో బంద్‌కు మద్దత్తుగా ప్రవేటు విద్యాసంస్థలు స్వచ్చందంగా సెలవు ప్రకటించాయి. యర్రగొండపాలెం నియెజకవర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. బంద్‌ చేపట్టిన ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లడంతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.




అనంతపురం జిల్లా :
ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. టీడీపీ, బీజేపీ మోసాలను నిరసిస్తూ పెనుకొండ సమన్వయ కర్త శంకర్ నారాయణ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మహాలక్ష్మి శ్రీనివాస్, రాగేపరశురాం హౌస్ అరెస్ట్ చేశారు.



పశ్చిమ గోదావరి జిల్లా : 
నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో నరసాపురంలో  ధర్నా నిర్వహించారు. ఉదయం ఐదు గంటల నుండి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బస్టాండ్ వద్ద బైఠాయించారు. భారీగా పోలీసులు బస్టాండ్‌ వద్దకు చేరుకున్నారు. కొవ్వూరు బస్టాండ్ వద్ద నియోజకవర్గ కన్వీనర్ తానేటి వనిత ఆధ్వర్యంలో బస్సును కార్యకర్తలు అడ్డుకున్నారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఎలీజా ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు సాయి బాలపద్మా, బాబ్జి, బి.వి.ఆర్. చౌదరి, ఆది విష్ణు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా :
పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జోగారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. బంద్‌లో పాల్గొన్న పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీర భద్రస్వామి, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుమారు వంద మంది కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్ కోట, గజపతినగరంలో వైఎస్సార్‌సీపీ బంద్ నేపథ్యంలో బస్సులు ఆర్టీసీ డిపోకే పరిమితమయ్యాయి.

చిత్తూరు జిల్లా : 

నగరి నియోజకవర్గం పుత్తూరులో బంద్‌లో పాల్గొన్నవైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెలే లు నారాయణ స్వామి, రోజాలను పోలీసులు అరెస్ట్ చేశారు. కుప్పం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. పలమనేరులో వైఎస్సార్‌సీపీ ఇంచార్జి వెంకటేశ్‌ గౌడ్ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. తుమ్మలగుంటలో బంద్‌లో పాల్గొన్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి యంఆర్ పల్లె పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నెల్లూరు జిల్లా : 
కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంకటగిరిలో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వెంకటగిరి, తిరుపతి రహదారిని కార్యకర్తలు దిగ్బంధించడంతో వాహనాలు పెద్ద మొత్తంలో నిలిచిపోయాయి. ఆత్మకూరులో బంద్ చేస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నాయకులు కొండ వెంకటేశ్వర్లు, నోటి వినయ్ కుమార్, ప్రతాప్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

విశాఖ జిల్లా: దక్షిణ నియోజక వర్గం కన్వీనర్ కోలా గురువులు, జాన్ వెస్లీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడంతో ద్వారకా బస్ స్టాండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బంద్‌కు మద్దతుగా మద్దిలపాలెం జంక్షన్‌లో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  సమన్వయ కర్తలు తైనాల విజయ్ కుమార్, వంశీ కృష్ణ, కె.కె.రాజు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చొక్కాకుల వేంకటరరావు, రామన్న పాత్రుడు, బొని శివరామ కృష్ణ, శ్రీదేవిలు ర్యాలీ లో పాల్గొన్నారు. మద్దిలపాలెం జుంక్షన్‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయుడు శ్రీను, రవి, వరలక్ష్మి, కృపాతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తూర్పు గోదావరి జిల్లా :
అమలాపురం బస్టాండు వద్ద పి.గన్నవరం కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం ఆర్టీసీ డిపో ఎదుట కార్యకర్తలు, నాయకులు బైఠాయించడంతో బస్సులు నిలిచిపోయాయి.

వైయ‌స్ఆర్ జిల్లా :
పులివెందుల బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రి వైయ‌స్ వివేకానంద రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బంద్ చేపడుతున్న వైయ‌స్ మనోహర్ రెడ్డిని పోలీసుల అరెస్ట్ చేశారు. రాయచోటిలో బంద్ పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.



శ్రీకాకుళం: 
పలాస ఆర్టీసీ డిపో ముందు పలాస వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు ధర్నాలో పాల్గొన్నారు. టెక్కలి ఆర్టీసీ డిపో ముందు టెక్కలి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పేరాడ తిలక్ ధర్నాకు దిగారు.

విజయవాడ: పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్దకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. బంద్‌లోభాగంగా ఆర్టీసి అవుట్ గేట్ వద్ద నిరసనలు చేపట్టారు. దీంతో బస్ స్డేషన్ వద్ద పోలీస్ భారీగా మోహరించారు. విద్యాధరపురం ఆర్టీసి డిపోవద్ద మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బస్సులను బయటకు రానివ్వకుండా కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.

కర్నూలు జిల్లా: 
పత్తికొండ ఆర్టీసీ డిపో నుండి బస్సులు బయటకు రాకుండా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చెరుకులపాడు శ్రీదేవి ఆధ్వర్యంలో పార్టీ నేతలు శ్రీరంగడు, బజారప్ప యూత్ యూత్ నాయకులు మధు, ఇమ్రాన్, పార్టీ కార్యకర్తలు డిపో ఎదుట బైఠాయించారు. డోన్‌లో తెల్లవారుజామున 4 గంటలకే బంద్ ప్రభావం మొదలైంది. జెడ్పీటీసీ శ్రీరాములు ఆధ్వర్యంలో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నియోజకవర్గ ఇంచార్జి హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. బివై రామయ్యా, తెర్నకల్ సురేందర్ రెడ్డి, రాజా విష్ణు వర్దన్ రెడ్డి, రెహమాన్, రేణుకమ్మలు బంద్‌లో పాల్గొన్నారు. ఆత్మ‌కూరులో శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఆధ్వ‌ర్యంలో..ఆదోనిలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.


Back to Top