అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
అండా.. దండా అన్నీ జగనన్నే
05 Aug 2018 3:17 PM
ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్న జననేత
ప్రత్తిపాడుకు చేరుకున్న ప్రజా సంకల్పయాత్ర
తూర్పుగోదావరి: ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 102వ నియోజకవర్గంలోకి చేరింది. పిఠాపురం దుర్గాడ క్రాస్ నుంచి ప్రారంభమైన 229వ రోజు ప్రజా సంకల్పయాత్ర ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. వైయస్ జగన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జననేతను వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కలిసి వారి కష్టాలను చెప్పుకుంటున్నారు. వారికి అండగా ఉంటానని, వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే ప్రజారంజక పాలన అందిస్తానని హామీ ఇస్తున్నారు.
వైయస్ జగన్మోహన్రెడ్డి బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలతో ప్రత్తిపాడు నియోజకవర్గం కళకళలాడుతోంది. జననేత నడిచే దారంతా వైయస్ఆర్ సీపీ జెండాలతో నిండిపోయింది. సాయంత్రం నియోజకవర్గంలోని కత్తిపూడిలో జరిగే భారీ బహిరంగసభలో వైయస్ జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.