ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
వైయస్ జగన్ కోసం ప్రాణాలర్పిస్తాం
17 Jul 2018 11:55 AM
తూర్పు గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు తమ ప్రాణాలైన అర్పిస్తామని అనపర్తి నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. మంగళవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కరకుదురు వద్ద పలువురు మహిళలు, కాపు నాయకులు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ..చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే..తమపై అక్రమ కేసులు పెట్టారని, దొంగలను కొట్టినట్లు తమను కొట్టారన్నారు. కాపుల్లో కూటికి లేనోళ్లు ఎంతో మంది ఉన్నారని, మేమంతా కూడా ఒక సంఘం కింద లేకపోవడంతో మాతో చంద్రబాబు ఆడుకుంటున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో చంద్రబాబు చేసిందంతా దొందుదొందే అన్నారు. మా కాపులకు అంతా అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలు పెట్టి కాపు రుణాలు వైయస్ఆర్సీపీ వాళ్లకు ఇవ్వవద్దని ఆంక్షలు పెట్టారని చెప్పారు. జగన్ పార్టీ వాళ్లకు ఎవరికి ప్రభుత్వ పథకాలు ఇవ్వకండి అని చంద్రబాబు జన్మభూమి కమిటీలకు చెప్పారని పేర్కొన్నారు. జగనన్న రావాలని..ఆయన రాకుంటే ప్రాణాలు తీసుకుంటామని ఓ మహిళ ఉద్వేగంగా చెప్పారు. జగనన్న ఎలా పాలిస్తున్నారో చంద్రబాబు కళ్లరా చూడాలని ఆమె వ్యాఖ్యానించారు.