ఆనం రామనారాయ‌ణ‌రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

 విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ నాయ‌కుడు ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా వేచలంలో ఉన్న వైయ‌స్ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో పాటు పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో వీరిని వైయ‌స్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ఆనం మద్దతుదారులు వైయ‌స్ఆర్‌సీపీలో  చేరడంతో ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది.

వైయ‌స్ జగన్‌ ప్రయత్నం విజయవంతం కావాలి
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆనం రామానారాయణ రెడ్డి విమర్శించారు. ప్రజలను టీడీపీ, బీజేపీ దారుణంగా మోసం చేశాయని దుయ్యబట్టారు. ప్రజలకు అండగా నిలవాలని వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని, ఆయన చేసే ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆనం రామానారాయణ రెడ్డి చేరికపై వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి ఆయన అనుభవం ఉపయోగపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అందరం కలిసి ఏకతాటిపై నడిచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.
 

Back to Top