మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
తెలంగాణలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు
14 Apr 2017 4:58 PM
హైదరాబాద్: రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అచ్చిరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా పులాస్ చౌరస్తాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా ఖమ్మం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అజాద్, బీజే ప్రభాకర్లు మధిర లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.