రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం

– హైకోర్టు వద్దన్నా..కోళ్లకు కత్తులు కట్టి పందేలు
– వందల ఎకరాల్లో కోడి పందేల కోసం బరులు తయారు చేశారు
– బరులు కట్టి, ఫ్లెక్సీలు పెట్టి మరీ కోడి పందెలు నిర్వహిస్తున్నారు.
– పందేలను నిర్వహిస్తోంది సాక్షాత్తు టీడీపీ నేతలే
– కోళ్లకు కత్తులు కట్టకుండా ఆడండని సీఎం చెప్పారు
– ప్రతిపక్ష నేతలను అడ్డుకునే పోలీసులు ఇప్పుడేం చేస్తున్నారు 

విజయవాడ: రాష్ట్రంలో జూదం, కోడి పందేలు యధేచ్ఛగా జరుగుతున్నా వాటిని అడ్డుకోవడంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రంలో కోళ్లకు కత్తులు కట్టి కోడి పందేలు నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించినా లెక్కచేయకుండా టీడీపీ నేతలే దగ్గరుండి వందల ఎకరాల్లో కోడి పందేల కోసం బరులు తయారు చేశారని ఆయన మండిపడ్డారు. మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, ఎద్దుల పందాలతో ప్రజలు రిలాక్స్‌ అవుతారన్నారు. గంగిరెద్దులు, హరిదాసులతో చాలా కోలాహలంగా జరిగే పండుగ అన్నారు. మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొని సంతోషంగా గడిపారన్నారు. అయితే ఒక బాధకరమైన పోటీ కూడా జరుగుతుందన్నారు. న్యాయస్థానం కోడి పందేలు కత్తులు కట్టి జరుపకూడదని సూచించింది. ^è క్కగా, సాంప్రదాయబద్ధంగా కోడి పందెలే నిర్వహించమని చెప్పందన్నారు. హైకోర్టు గత ఏడాది ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదని, ఈ సారైనా పాటించాలని ఆదేశించిందన్నారు. ముఖ్యమంత్రి కూడా మీ సాంప్రదాయాన్ని నేరవేర్చుకోండి, కత్తులు కట్టుకోవద్దని సూచించారు. కానీ కోళ్లకు కత్తులు కట్టి వందల ఎకరాల్లో పిచ్చులు తయారు చేసి, ఫ్లడ్‌లైట్స్‌ ఏర్పాటు చేసి పందెలు నిర్వహిస్తున్నారన్నారు. వీటన్నింటిని టీడీపీ నేతలే నిర్వహించడం దారుణమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఒక చోట కోడి పందెలు నిర్వహిస్తే..అక్కడ మందు అమ్ముకునేందుకు, తిండి పదార్థాలు అమ్ముకునేందుకు టీడీపీ నేతలకు కోటి రుపాయాలు ఇచ్చారన్నారు. పోలీసు వ్యవస్థ ఈ మూడు రోజుల పాటు ఎందుకు నిర్వీర్యమైందన్నారు. పేకాటాలు, జూదం ఆడుతున్నారన్నారని విమర్శించారు. టీవీల ముందు కత్తులు లేనట్లు నటన చేస్తూ, వారు వెళ్లిపోగానే కత్తులతో పోటీలు నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. న్యాయస్థానాల ఆదేశాలను కూడా ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందన్నారు. వైయస్‌ జగన్‌ విశాఖలోని క్యాండిల్‌ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తే పోలీసులు వందలాది మంది వచ్చి అడ్డుకుంటారు, అలాగే ముద్రగడ పాదయాత్ర చేస్తామంటా పోలీసులు మొహరిస్తున్నారు. మేం జన్మభూమిలో పాల్గొంటామంటే అడ్డుకున్నారు. అదే టీడీపీ నేతలు కోడిపందెలు నిర్వహిస్తుంటే పోలీసులు ఎందుకు చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు. సంప్రదాయం ముగుగులో వేల కోట్లు చేతులు మారుతున్నాయని, టీడీపీ నేతలే నిర్వాహకులు కావడం దుర్మార్గమన్నారు. ప్రజా ప్రతినిధులే ఇలాంటి అసాంఘిక శక్తులగా మారడం బాధాకరమన్నారు. క్రికెట్‌ పోటీల మాదిరిగా ఫ్లడ్‌ లైట్స్‌ వెలుగులో బరులు ఏర్పాటు చేసి కోడి పందెలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమన్నారు. క్రికెట్‌బెట్టింగ్‌లు కట్టే వారిని పట్టుకుంటున్న పోలీసులు కోడి పందెలు ఆడే వారిని ఎందుకు పట్టుకోవడం లేదన్నారు. సంప్రదాయంగా వస్తున్న ఆటను జూదంగా మార్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు డబ్బులు సంపాదించడం దురదృష్టకరమన్నారు.  సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ జూద గృహాలు నిర్వహిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. బెల్టు షాపులు రద్దు అని చంద్రబాబు అన్నారు. కానీ బడిలు వద్ద బహిరంగంగా మద్యం అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని, న్యాయస్థానం అంటే వీరికి లెక్కలేదన్నారు. కోడి పందేలు వేసి రక్తసిక్తం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చంద్రబాబు సమాధానం చెప్పాలని  అంబటి రాంబాబు డిమాండు చేశారు. హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకపోవడం దుర్మార్గమని, ప్రజల బలహీనలపై సొమ్ము చేసుకోవడాన్ని వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుందని అంబటి రాంబాబు అన్నారు. కోడి పందేలు నిర్వహించిన వారిపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. 
 
Back to Top