రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
గంటా జీవో రద్దు చేయించు..!
07 Nov 2015 11:55 AM
విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్ నాథ్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు బాక్సైట్ తవ్వకాలపై నిరసన గళం వినిపించిన చంద్రబాబు.. ఇప్పుడు గిరిజన సంపదను తవ్వి ఎత్తుకుపోతామని చెబుతుండటం ఆయన గొప్పతనానికి నిదర్శనమని విమర్శించారు. అఖిలపక్షం పిలుపుమేరకు విశాఖ మన్యంలోని 13 మండలాల్లో బంద్ కొనసాగుతోంది.
ఈసందర్భంగా అమర్ నాథ్ మీడియాతో మాట్లాడుతూ...లక్షల కోట్ల విలువైన గిరిజన సంపదను ఎవరికి ధారాదత్తం చేస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖపై ఏమాత్రం ప్రేమ ఉన్నా ముఖ్యమంత్రితో మాట్లాడి జీవో నంబర్ 97ను రద్దు చేయించాలన్నారు. బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దుచేసేవరకు గిరిజనుల తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుందని అమర్ నాథ్ స్పష్టం చేశారు.