మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
గొంతెండుతోన్నా పట్టదా..!
24 Dec 2015 4:27 PM
మంగళగిరి: ప్రభుత్వం అసమర్ధత కారణంగానే గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా
మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాల్లో వేసవికి ముందే నీళ్ల ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపారు. కృష్ణా
నదిలో నీటి నిల్వలు త గ్గుముఖం పట్టటంతో సమస్య తీవ్రతరమైందని చెప్పారు. ప్రభుత్వం
ముందు జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని తెలిపారు.
వెంటనే మున్సిపల్ అధికారులు పరిష్కార మార్గాలు వెదికి, ప్రజల ఇక్కట్లు తీర్చాలని కోరారు. ఒక వైపు
నుంచి నీటి నిల్వలు తగ్గుతున్నాయని ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నా ప్రభుత్వానికి
ఎందుకు పట్టడం లేదని ఆయన మండిపడ్డారు.