చంద్రబాబు ఎక్కడ నిద్రపోయాడు..!

గుంటూరు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజధాని ప్రాంతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించేవరకు అసైన్డ్ భూముల రైతుల అవస్థలు ప్రభుత్వానికి తెలియలేదా అని ప్రశ్నించారు. ఇంతకాలం రైతులు ఆందోళన చేస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడ నిద్రపోయారన్నారు.

భూములు ఇవ్వక పోతే భూ సేకరణ చేస్తామనడం అవివేకానికి నిదర్శనమన్నారు. భూఆర్డినెన్స్ చట్టంపై కేంద్ర ప్రభుత్వమే వెనకడుగేసిన సంగతి గుర్తుంచుకోవలన్నారు. అయినా భూ సేకరణ చేయాలనుకుంటే దమ్ము, ధైర్యముంటే నోటిఫికేషన్ ఇవ్వండని ఆర్కే ప్రభుత్వాన్ని  హెచ్చరించారు
Back to Top