కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
కబ్జాకోరులంతా జైలుకు వెళ్లాల్సిందే
12 Jun 2017 4:43 PM
- టీడీపీ భూ కుంభకోణాలపై అఖిలపక్షం మండిపాటు
- ముదపాక భూములను పరిశీలించిన నేతలు
- కబ్జా చేసిన భూములను తిరిగిచ్చేయాలి
- వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్
- రైతులు, దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని సుస్పష్టం
విశాఖపట్నంః టీడీపీ భూకుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలి, సాగుదారులకు భూమిపై హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖలో ఆల్ పార్టీస్ ఉద్యమబాట పట్టాయి. నేడు అఖిలపక్ష నాయకులతో కలిసి విజయసాయిరెడ్డి ముదపాక భూములను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. 500 ఎకరాలు హుడా ల్యాండ్ పూలింగ్ కోసం టీడీపీ నేతలు రైతులను మభ్యపెట్టి భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు న్యాయం జరగడం కోసం అఖిలపక్షం మహాధర్నాకు ప్లాన్ చేస్తోంది.
ఉద్యమం ఆపాలంటూ టీడీపీ నేతలు తనకు వర్తమానం పంపడంపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. మభ్యపెట్టడం మానుకోవాలని హితవు పలికారు. రైతులు, దళితులకు అన్యాయం చేస్తూ... ముదపాకలో మీరు ఏభూములైతే కబ్జా చేశారో అవన్నీ వారికి తిరిగిచ్చేయాలని సూచించారు. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే మంత్రులు, టీడీపీ నేతల భూ కబ్జా సాగుతోందని, వీరంతా జైలుకెళ్లాల్సిందేనని విజయసాయిరెడ్డి అన్నారు. రైతులు, దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదన్నారు.