రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
లోకేష్ నుంచి కిందిస్థాయి దాక అంతా నేరచరితులే
10 Mar 2017 12:20 PM
తిరుపతి: తెలుగుదేశం పార్టీ గజదొంగల పార్టీగా మారిందని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. టీడీపీలో బ్యాంకులను లూటీ చేసేవారు పెరిగిపోతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రి గంటా శ్రీనివాసరావు వంటివారు చాలా మంది ఉన్నారని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కొడుకు నారా లోకేష్ నుంచి కిందిస్థాయి వరకు అందరిదీ నేరచరిత్రేనని భూమన ఆరోపించారు. టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడుతుంటే చంద్రబాబు మాత్రం నీతులు చెబుతున్నారని విమర్శించారు.