కాలవ శ్రీనివాసులు నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రా...ప్రజాకోర్టులో తేల్చుకుందాం. మేమంతా సిద్ధం - 20వ రోజు షెడ్యూల్బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా?
అక్రమ నిర్బంధానికి నిరసనగా 27న ప్రదర్శన
25 May 2013 11:02 AM
హైదరాబాద్, 25 మే 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏడాదిగా జైలులో అక్రమంగా నిర్భంధించిన తీరుపై నిరసన వ్యక్తం చేయడానికి సోమవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డులోని పీపుల్సు ప్లాజాలో నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీకి తరలి రావాలని శ్రీ జగన్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి వైయస్ భారతి పిలుపునిచ్చారు. మే 27 తేది సాయంత్రం 6 గంటలకు నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీ, మౌన ప్రదర్శన కార్యక్రమంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డికి బాసటగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు తరలిరావాలని అభిమానులను శ్రీమతి భారతి కోరారు.