వైయ‌స్ జగన్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు

హైదరాబాద్:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిని అగ్రిగోల్డ్ బాధితులు ఆయన నివాసంలో కలిశారు. మార్చి 3 నుంచి కృష్ణా జిల్లా విజయవాడలో తాము చేపట్టనున్న నిరవధిక దీక్షకు మద్దతివ్వాలని అగ్రిగోల్డ్ బాధితులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కోరారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని అగ్రిగోల్డ్ బాధితులు ఆయ‌న‌కు విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

Back to Top