వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
సమైక్యాంధ్ర వచ్చే దాకా పోరాటం: ద్వారంపూడి
12 Aug 2013 2:47 PM
కాకినాడ :
సమైక్యాంధ్రను సాధించే వరకూ పోరాటం కొనసాగిస్తామని కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన సమైక్యాంధ్ర పోస్టర్ను కాకినాడలోని గొడారిగుంటలో ఉన్న క్యాంప్ కార్యాలయంలో ద్వారంపూడి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలను మరింతగా భాగస్వాములను చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తామన్నారు. సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక జెఎసికి పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.