వైయస్ జగన్ ను కలిసిన మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్

వైయస్ఆర్ జిల్లాః పులివెందులలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ను కలుసుకున్నారు. పథకాన్ని బడా సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విన్నవించారు. ఏడు నెలలుగా జీతాలు, బిల్లులు ఇవ్వడం లేదని వైయస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.

Back to Top