ప్రతిపక్షంపై అధికారపార్టీ బరితెగింపు వ్యాఖ్యలు..!

హైదరాబాద్: అసెంబ్లీలో పచ్చనేతల పైత్యం రోజురోజుకు ముదురుతోంది.  ఓపచ్చమంత్రి మరోసారి సభలో వైఎస్సార్సీపీపై సభ్యులపై వ్యక్తిగత దూషణలకు దిగారు. స్పీకర్ మందలించినా అచ్చెన్నాయుడు బుద్ధిమారడం లేదు. పదేపదే  ప్రతిపక్షసభ్యులపై దుర్భషలాడుతూ సభా నియమాలను మంటగల్పుతున్నారు.  

వైఎస్సార్సీపీని సైకో పార్టీగా పెట్టుకోవాలన్న  అచ్చెన్నాయుడు  వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు  ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటూ స్పీకర్ పోడియం ముందు ఆందోళన చేపట్టారు. అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ కు వైఎస్సార్సీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. 

తాజా వీడియోలు

Back to Top