నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి
03 May 2013 6:43 PM
హైదరాబాద్ 03 మే 2013:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చేపట్టే నియామకాలలో అభ్యర్థుల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 39 ఏళ్లకు పెంచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి ఈ మేరకు డిమాండ్ చేశారు. లెక్చరర్ల నియామకాల్లోనూ, డీయస్సీ నియామకాల వయోపరిమితినే పాటించాలని బాలినేని సూచించారు. యూపీ, కేరళ, బెంగాల్ రాష్ట్రాలలో అన్ని నియామకాల్లో వయోపరిమితి 40 ఏళ్లుగా ఉందనీ,..యూపీపీఎస్సీ తరహాలో ప్రతి ఏడాది ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. వెలువరించే పలు ప్రకటనల్లో తీవ్ర జాప్యం కూడా చోటుచేసుకుంటోందన్నారు. దీనివల్ల విద్యావంతులైన యువతీయువకుల అవకాశాలు చేజారుతున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోకుండా వయోపరిమితి పెంచాలని బాలినేని, భూమన కోరారు.