మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురి నియామకం
31 Oct 2017 6:10 PM
మామిడికుదురు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ , ఎస్సీ సెల్ విభాగాల్లో పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన ముగ్గురిని నియమించారు. పి.గన్నవరం మండలం మానేపల్లి గ్రామానికి చెందిన పితాని నర్సింహారావును పార్టీ బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగాను, అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారానికి చెందిన మట్టపర్తి మీరాసాహేబ్శెట్టిని పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగాను, అదే మండలం చిరుతపూడి గ్రామానికి చెందిన నేతల నాగరాజును ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగాను నియమించారని పి.గన్నవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు మంగళవారం తెలిపారు. తమకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించిన పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి మిండగుదుటి మోహనరావు, పి.గన్నవరం కో–ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, మండల శాఖ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు, వాసంశెట్టి చినబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తమపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని, జగన్ ముఖ్యమంత్రి కావడమే తమ లక్ష్యంగా పని చేస్తామన్నారు.