70 ల‌క్ష‌ల‌కు చేరిన వైయ‌స్ఆర్ కుటుంబం

తిరుపతిః వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తుంద‌ని ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 ల‌క్ష‌ల కుటుంబాలు వైయ‌స్ఆర్ కుటుంబంలో చేరాయ‌ని చెప్పారు. తిరుపతిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో ఆయన వైఎస్సార్‌ కుటుంబం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...వైయ‌స్ఆర్‌ కుటుంబంలో సభ్యత్వం తీసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి అనూహ్య‌ స్పందన లభిస్తుందన్నారు. త్వరలోనే కోటి కుటుంబాలు వైయ‌స్ఆర్‌ కుటుంబంలో చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతోందని, ఎన్నికలప్పుడు వారు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు కాలేదని విమర్శించారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని బాబు, లోకేశ్‌లు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు తరిమి కొడతారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Back to Top