కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
14 సొసైటీలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా
04 Jun 2013 2:50 PM
ఒంగోలు :
ప్రకాశం జిల్లాలో శాంతిభద్రతల సాకుతో ప్రభుత్వం ఎన్నిక నిలిపివేసిన 16 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో మొత్తం 14 సంఘాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బేస్తవారిపేట, పెద్దారవీడు సొసైటీల పాలకవర్గాలు మే 31న ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఆ రెండు సొసైటీల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.
తాజాగా సోమవారం మిగిలిన 14 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 12 సొసైటీలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఒక సొసైటీలో కాంగ్రెస్ గెలుపొందగా, మరో సొసైటీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్, టిడిపిల మధ్య పోటీ నెలకొంది.
శాంతిభద్రతల సాకుతో ఎన్నిక నిలిపివేసిన ఈ సొసైటీలన్నింటిలో సోమవారం ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. దీన్నిబట్టి ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఆ సొసైటీల ఎన్నికలను వాయిదా వేయించిందనేది తేటతెల్లమైంది.