చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఎమ్మెల్యే చెవిరెడ్డి మీద పోలీసుల దౌర్జన్యం
19 Aug 2015 4:16 PM
తిరుపతి: రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద పోలీసుల దాడులు ఆగటం లేదు. మొన్న భూమా నాగిరెడ్డి, నిన్న రోజా, ఆమె అనుచర నాయకులు.. నేడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఏకంగా ఆయన వాహనాన్ని జీపుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. కొంత కాలంగా ప్రజా సమస్యల మీద ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పచ్చచొక్కాల దౌర్జన్యాల్ని ఆయన ఎదుర్కొంటున్నారు. దీనిపై మండిపడుతున్న తెలుగుదేశం నాయకులు ఆయన పై కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ దాడి జరిగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు.