వైఎస్ జగన్.. రాజకీయ పునర్జన్మ ఇచ్చారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండ‌లి స‌భ్యుడిగా మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత మంత్రిమండ‌లిలో ఉండ‌లేనంటూ బ‌య‌ట‌కు వ‌చ్చేసిన బోస్.. త‌ర్వాత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిర్భావం నుంచీ ప‌నిచేస్తున్నారు. ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా మాట్లాడుతూ.. పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జగన్  తనకు రాజకీయ పునర్జన్మ ప్రసాదించారని  బోస్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను టీడీపీ విస్మరించిదన్నారు.

శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెల్టా రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తుందని సుభాష్ చంద్రబాస్ అన్నారు. పట్టిసీమపై అన్ని వేదికల్లోనూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన వైఎస్ జగన్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా ఆయ‌న‌  ధన్యవాదాలు  తెలిపారు.
Back to Top