అమెరికాలో వైయస్ఆర్‌సిపి సమైక్య శంఖారావం

హార్టుఫోర్డు సిటీ:

ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించవద్దని, సమైక్యంగానే ఉంచాలని అమెరికాలో ఉన్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రవాసాంధ్రులు నినదించారు. అమెరికాలోని హార్టుఫోర్డు సిటీలో పార్టీకి చెందిన వారు సమైక్య శంఖారావానికి మద్దతుగా సమావేశమయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వారు మాట్లాడారు. రత్నాకర్‌ పి. ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీకి చెందిన కృష్ణమోహన్, శ్రీను వాసిరెడ్డి, రమేష్‌బాబు, జితేంద్రరెడ్డి, శ్రీధర్ చాగరి, జగన్మోహ‌న్ పులిమి, గోపాల సుబ్బయ్య, సురే‌ష్‌రెడ్డి, భక్తియార్‌ఖాన్, విజ‌య్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top