పోల‌వ‌రంపై వైయ‌స్ఆర్‌సీపీ వాయిదా తీర్మానం

న్యూఢిల్లీ: పోలవరంపై లోక్‌సభలో వైయ‌స్ఆర్ సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.  పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని నోటీస్‌ ఇచ్చింది. ఎంపీ చింతా అనురాధ లోక్‌సభలో వాయిదా తీర్మానం అందజేశారు.  15వ రోజు పార్లమెంట్‌ ఉభయ సభలు కాసేప‌టి క్రితం ప్రారంభ‌మైంది. ఈ వారంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి.  

Back to Top