మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ నిరూపిస్తుందా?
08 Aug 2020 4:24 PM
పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ సవాల్
విశాఖపట్నం: విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ నిరూపించాలని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ సవాల్ విసిరారు. అమరావతిలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ, పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. శనివారం అదీప్రాజ్ మీడియాతో మాట్లాడుతూ ..టీడీపీ హయాంలో విశాఖ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదాల్లో 53 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు జరిగిన చిన్న ప్రమాదాలను కూడా రాజకీయం చేసి విశాఖపై విషం చిమ్ముతున్నారని నిప్పులు చెరిగారు. అమరావతిలో జరిగిన అక్రమాలను అసెంబ్లీలో సాక్ష్యాలతో సహా నిరూపించామని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఉన్నారా.. లేక డూప్తో మాట్లాడిస్తున్నారో అర్థం కావడం లేదు. నాలుగు నెలలుగా ఆయన అడ్రస్సే లేరని అదీప్ రాజ్ ఎద్దేవా చేశారు.