రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
నిజాన్ని నిగ్గు తేల్చాలి...
02 Jan 2019 2:50 PM
చంద్రబాబు ప్రమేయంతో వైయస్ జగన్పై హత్యాయత్నం..
కేంద్రం దర్యాప్తుతోనే వాస్తవాలు బయటకొస్తాయి...
వైయస్ఆర్సీపీ నేత మళ్లా విజయప్రసాద్
విశాఖపట్నం: నూటికి నూరు పాళ్లు చంద్రబాబు ప్రమేయంతోనే వైయస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని వైయస్ఆర్సీపీ నేత మళ్లా విజయప్రసాద్ పేర్కొన్నారు. తూతూ మంత్రంగా సిట్ విచారణ అంటూ కేసును నీరుగార్చడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొవడం చేతకాక ఆయనను తుద ముట్టించడానికి చంద్రబాబు అండ్ కో పక్కా ప్లాన్ వేసిందన్నారు.ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించకుండా రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతరేశారన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై అనేక అనుమానాలు ఉన్నాయి.ఎన్వోసి అనుమతులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.ఎయిర్పోర్ట్ రెస్టారెంట్ యజమాని చంద్రబాబు,లోకేష్కు అత్యంత సన్నిహితుడని అని తెలిపారు. దర్యాప్తు కొనసాగించకుండా పబ్లిసిటీ కోసం చేశాడని తప్పుదారి పట్టించడానికి ముఖ్యమంత్రి,డీజీపీ ప్రయత్నించారని గుర్తు చేశారు.జగన్పై హత్యాయత్నం జరగడానికి టీడీపీకి సంబంధం లేకపోతే ఎందుకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తునకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అభిమానంతో చేశాడని భావిస్తే వాస్తవాన్ని నిగ్గుతేల్చాలన్నారు. కేంద్ర దర్యాప్తు చేస్తేనే నిజనిజాలు బయటకొస్తాయన్నారు.