ఇలాగైతే ప్రతి పోలీసు స్టేషన్‌ వద్ద సీబీఐ ఆఫీసు పెట్టాల్సిందే 

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్‌
 

తాడేపల్లి:  చిన్న చిన్న కేసులను కూడా సీబీఐ విచారణకు ఆదేశిస్తే  ప్రతి పోలీసు స్టేషన్‌ వద్ద సీబీఐ ఆఫీసులు పెట్టాల్సి వస్తుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్‌ పేర్కొన్నారు. విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ అంశం పెటికేసు మాత్రమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై డాక్టర్‌ సుధాకర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ తీరును సమర్ధించేలా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదని, కానీ ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతుందన్నారు. 

Back to Top