బాబు సాధించేదేమిటో చెప్పాలి

 వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బీవై రామయ్య
 

కర్నూలు :  చంద్ర‌బాబు బీజేపీతో నాలుగు సంవత్సరాలు కాపురం చేసి సాధించిందేమిటో.. ప్రస్తుతం కాంగ్రెస్‌తో జత కట్టి సాధించేదేమిటో చెప్పాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బీవై రామయ్య డిమాండ్‌ చేశారు.  చంద్ర‌బాబు లాంటి నీచపు రాజకీయాలు తమకు చేతకావంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైయ‌స్‌ జగన్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసారే తప్ప సీఎం చంద్రబాబు నాయుడులాగా చీకటి ఒప్పందాలు చేసుకోలేదని   అన్నారు.

చంద్రబాబు దేశమంతటా తిరిగి ఇప్పటివరకు ఎన్ని రాష్ట్రాలను ప్రత్యేక హోదా కోసం ఒప్పించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు అంటూ చంద్రబాబు తన మంత్రులతో అబద్ధపు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. 

 

Back to Top