బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
బాబు సాధించేదేమిటో చెప్పాలి
17 Jan 2019 4:00 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య
కర్నూలు : చంద్రబాబు బీజేపీతో నాలుగు సంవత్సరాలు కాపురం చేసి సాధించిందేమిటో.. ప్రస్తుతం కాంగ్రెస్తో జత కట్టి సాధించేదేమిటో చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు లాంటి నీచపు రాజకీయాలు తమకు చేతకావంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ ఫెడరల్ ఫ్రంట్తో కలిసారే తప్ప సీఎం చంద్రబాబు నాయుడులాగా చీకటి ఒప్పందాలు చేసుకోలేదని అన్నారు.
చంద్రబాబు దేశమంతటా తిరిగి ఇప్పటివరకు ఎన్ని రాష్ట్రాలను ప్రత్యేక హోదా కోసం ఒప్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ పార్టీతో పొత్తు అంటూ చంద్రబాబు తన మంత్రులతో అబద్ధపు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.