మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రైతు దినోత్సవ వేడుకలు ప్రారంభం
08 Jul 2019 1:51 PM
వైయస్ఆర్ జిల్లా: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పులివెందులలో వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం గండి వీరాంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన ముఖ్యమంత్రి జమ్మలమడుగులోని రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. సభా వేదికపై వైయస్ఆర్ విగ్రహానికి ఆకుపచ్చ కండువా వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజద్బాషా, మంత్రులు కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి హాజరయ్యారు.