ఈ విజయంతో మేం గర్వపడుతున్నాం: వైయ‌స్‌ జగన్‌

 టీమిండియా వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

అమ‌రావ‌తి : ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన కోహ్లిసేనకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. ఈ విజ‌యంపై మేం గ‌ర్వ‌ప‌డుతున్నామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  ఆసీస్‌ గడ్డపై సిరీస్‌ గెలవాలన్న భారత్‌ దశాబ్దాల కల నెరవేరడం సంతోషంగా ఉంద‌న్నారు. ఇలాంటి విజ‌యాలు మ‌రెన్నో సాధించి దేశానికి కీర్తి తీసుకురావాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.   

తాజా వీడియోలు

Back to Top