విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో మహిళా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మహిళలకు చేసిన మోసాన్ని మహిళా నాయకురాళ్లు ఎండగడుతున్నారు. అధిక సంఖ్యలో మహిళలు హాజరుకావడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది.