మంత్రి పేర్ని నానిని క‌లిసిన‌ సినీ నిర్మాతలు

విజ‌య‌వాడ‌: మచిలీపట్నంలోని మంత్రి పేర్ని నానిని సినీ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.  ఇటీవ‌ల ఆన్‌లైన్‌​ టికెట్‌ విధానంపై విజయవాడలో మంత్రి పేర్నినాని సమీక్ష సమావేశం నిర్వహించిన విష‌యం విధిత‌మే. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్‌ యజమానులతో మంత్రి భేటి అయి ప‌లు విష‌యాలు చ‌ర్చించారు. తాజాగా నిర్మాత‌లు క‌లిసి మంత్రితో స‌మాలోచ‌న‌లు చేశారు. 

Back to Top